కానీ తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ మాత్రం తాను ఆడుతున్న ఐదో టెస్టులోనే 23వ సిక్స్ బాది సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరూకి 14 టెస్టులు, 27 ఇన్నింగ్స్ అవసరం కాగా.. యశస్వి మాత్రం ఈ ఏడాది కేవలం ఐదో టెస్టులోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో రిషబ్ పంత్ 21 సిక్స్ లతో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.