ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చరిత్రాత్మక లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ వెలసిన వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లేపాక్షి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు. గుడిలో వేలాడే స్తంభాన్ని చూసి మోదీ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉండే శిల్ప కళల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఈ ఆలయం యూనెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఉంది. అటు పాల సముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు.