<p><strong>Vyuham Trailer:</strong> గత కొంతకాలంగా పొలిటికల్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందని చెప్తూ.. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే మరో పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్. తన అప్‌కమింగ్ మూవీ ‘వ్యూహం’తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ‘వ్యూహం’ రెండో ట్రైలర్‌ను కూడా విడుదలయ్యింది.</p>
<p><strong>అదే రెండు ట్రైలర్స్‌కు తేడా..</strong><br />‘‘ఇంతకాలం మిమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కేసిన మనిషి పైకే పోయాడు’’ అని వైఎస్ మరణ వార్తకు సంబంధించిన డైలాగ్‌తో ‘వ్యూహం’ రెండో ట్రైలర్ మొదలయ్యింది. ఈ సినిమా మొదటి ట్రైలర్‌లో చంద్రబాబుపై, జగన్ పాదయాత్రపై, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై ఎక్కువ ఫోకస్ పెట్టిన వర్మ.. రెండో ట్రైలర్‌లో మాత్రం జగన్ పాదయాత్రతో పాటు ఓదార్పు యాత్ర గురించి, పవన్ కళ్యాణ్ పార్టీ పట్టుదల గురించి చూపించాడు. అంతే కాకుండా ఈ ‘వ్యూహం’ రెండో ట్రైలర్‌లో చిరంజీవి పాత్రను కూడా యాడ్ చేశాడు. దీంతో ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.</p>
<p><strong>ట్రైలర్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్..</strong><br />‘వ్యూహం’ రెండో ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడిన ‘ఏడవకండి’ పాటను కూడా యాడ్ చేశారు. ఆ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉండగా జగన్.. తన ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను రాజకీయాల్లోకి వద్దని చిరంజీవి హెచ్చరించినా.. తను వినకుండా ఉన్న విషయాన్ని కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘‘క్షవరం అయితే కానీ వివరం తెలియదని ఊరికే అనలేదు పెద్దలు’’ అని పవన్ కళ్యాణ్ పెట్టే పార్టీ గురించి చిరంజీవి వ్యాఖ్యలు చేసినట్టుగా ట్రైలర్‌లో ఉంది. కాంట్రవర్సీలకు భయపడని రామ్ గోపాల్ వర్మ.. మరోసారి ఈ ‘వ్యూహం’ సినిమాతో ఎన్నో కాంట్రవర్సీలను క్రియేట్ చేయనున్నట్టుగా ట్రైలర్స్ చూస్తుంటే తెలుస్తోంది.</p>
<p><strong>వారే జోకర్లు..</strong><br />‘వ్యూహం’ ట్రైలర్స్‌ను బట్టి సినిమాలో వైఎస్ జగన్ పాత్రను పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్, <a title=”చంద్రబాబు” href=”https://telugu.abplive.com/topic/Chandrababu” data-type=”interlinkingkeywords”>చంద్రబాబు</a> పాత్రలను కాస్త వ్యంగ్యంగా చూపించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ చివర్లో పలు తెలుగు సినిమాలు విడుదల ఉన్నా కూడా.. తన సినిమాపై నమ్మకంతో డిసెంబర్ 29న ‘వ్యూహం’ను విడుదలకు సిద్ధం చేశాడు వర్మ. ‘జోక్ అర్థం కానివారు జోకర్లు’ అనే క్యాప్షన్‌తో ‘వ్యూహం’ సెకండ్ ట్రైలర్‌ను ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. ఈ సినిమాలో వైఎస్ <a title=”జగన్” href=”https://telugu.abplive.com/topic/cm-jagan” data-type=”interlinkingkeywords”>జగన్</a> పాత్రలో నటించిన అజ్మల్ అమీర్.. ఇందులో కూడా అదే పాత్ర చేస్తున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో ధనుంజయ్ ప్రభూనే, సురభి ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరామ్, ఎలినా నటించారు. ఇక ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ కచ్చితంగా ఏపీ పాలిటిక్స్‌పై ప్రభావం చూపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.</p>
<blockquote class=”twitter-tweet”>
<p dir=”ltr” lang=”en”>Anybody who doesn’t understand a JOKE are JOKERS 🤣🤣🤣<a href=”https://t.co/vKoPBhZ3sD”>https://t.co/vKoPBhZ3sD</a>.</p>
— Ram Gopal Varma (@RGVzoomin) <a href=”https://twitter.com/RGVzoomin/status/1735651668703006917?ref_src=twsrc%5Etfw”>December 15, 2023</a></blockquote>
<p>
<script src=”https://platform.twitter.com/widgets.js” async=”” charset=”utf-8″></script>
</p>
<p><strong>Also Read: <a title=”‘హాయ్ నాన్న’పై శ్రీలీల రివ్యూ – నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మృణాల్ రెస్పాన్స్” href=”https://telugu.abplive.com/entertainment/cinema/sreeleela-reviews-hi-nanna-and-mrunal-thakur-responds-in-a-very-sweet-way-133635″ target=”_self”>‘హాయ్ నాన్న’పై శ్రీలీల రివ్యూ – నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మృణాల్ రెస్పాన్స్</a></strong></p>
Vyuham Trailer: ‘వ్యూహం’ ట్రైలర్ – జోక్ అర్థంకానివారు జోకర్లు అంటూ ఆర్జీవీ సెటైర్!
Related Posts
*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు
ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు తాండూర్ ఏప్రిల్ 20 :- వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమం శనివారం రోజు తాండూర్ప్రా మండలంలో ప్రారంభమైంది. అందులో భాగంగా మండలంలోని ఎల్మకన్య గ్రామంలో నిర్వహిస్తున్న…