ఈ ప్రసాదం ఒక బేసిన్ లడ్డు. ఇది అక్కడ మాత్రమే టేస్టీగా సిద్ధం అవుతుంది. హనుమాన్ గర్హి ఆలయంలో దీన్ని హనుమంతుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులకు పంచి పెడతారు. శెనగపిండిని, నెయ్యిని, చక్కెరను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. హనుమంతుడిని దర్శించకపోతే శ్రీరాముడు దర్శనం అసంపూర్తిగా ఉంటుందని అంటారు. అయోధ్యలో హనుమంతుడిని కొత్వాల్ గా పూజిస్తారు. అంటే ఆ నగర రక్షకుడిగా పూజిస్తారు. తరతరాలుగా ఈ లడ్డును హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు.