విక్టరీ వెంకటేష్ ( venaktesh) నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ సైంధవ్‌. ఈ మూవీ ఆయన సినీ కెరీర్ లో 75 వ చిత్రంగా తెరెకెక్కింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో  అందరిలోను అంచనాలు పీక్ లో ఉన్నాయి. తాజాగా  ఆ చిత్ర నిర్మాత వెంకట్ బోయినపల్లి  సైంధవ్‌ గురించి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో  వెంకట్ (venkat) మాట్లాడుతు రేపు థియేటర్స్ లో  సైంధవ్‌ (saindhav)ని చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటితో బయటకి వస్తారు అని చెప్పాడు.  సినిమాలో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలకి చాలా మంది కనెక్ట్ అవుతారని చాలా సీన్స్ ప్రేక్షకుల హృదయాల్ని తాకుతాయని  సైంధవ్‌  మూవీ న్యూ ఏజ్ యాక్షన్ తో కూడిన మంచి ఫ్యామిలీ సినిమా అని కూడా ఆయన చెప్పాడు.

వెంకటేష్ సినీ కెరీర్లోనే పాన్ ఇండియా లెవల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతున్నసైంధవ్‌లో శ్రద్ద శ్రీనాధ్( shraddha srinath)కథానాయికగా  నటిస్తుండగా శైలేష్ కొలను దర్శకత్వాన్ని వహించాడు. సంతోష్ నారాయణ్ ( santhosh narayan)సంగీతాన్ని అందించాడు.