యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పని చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. తాము 2024 డిసెంబరు నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి, దానినో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందన్నారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు. తామ రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. టీఎస్పీఎస్సీలో అవకతవలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వివరించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నందున టీఎస్పీఎస్సీ ఛైర్మన్తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ పాల్గొన్నారు.
CM Revanth Reddy : టీఎస్పీఎస్పీ ప్రక్షాళన..! యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ సుదీర్ఘ భేటీ
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…