అగ్ర నిర్మాణ సంస్థ‌లు…

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌ల‌యాళ డ‌బ్బింగ్ బొమ్మ‌లు అద‌ర‌గొడుతోన్నాయి. గ‌త ఏడాది రిలీజైన 2018 నుంచి ఇటీవ‌ల విడుద‌లైన మంజుమ్మేల్ బాయ్స్ వ‌ర‌కు ప‌లు మ‌ల‌యాళ డ‌బ్బింగ్ సినిమాలు నిర్మాత‌లు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టాయి. ఇదివ‌ర‌కు మ‌ల‌యాళ డ‌బ్బింగ్ సినిమాల‌ను చిన్న నిర్మాత‌లు తెలుగులో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గీతా ఆర్డ్స్‌, సితార‌, మైత్రీ వంటి అగ్ర నిర్మాణ సంస్థ‌లు మ‌ల‌యాళ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాయి.