జోరుగా షూటింగ్

ది రాజాసాబ్ మూవీని కామెడీ హారర్ థ్రిల్లర్‌గా మారుతీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‍కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిధి కుమార్, జుషు సెంగుప్త, యోగిబాబు, వరలక్ష్మి శరత్‍కుమార్, బ్రహ్మానందం కీలకపాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.