తుది ఫలితాల్లో 1016 మంది ఎంపిక

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో(UPSC Civils Results) 1,016 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ (IAS)కు, 37 మంది ఐఎఫ్ఎస్(IFS) కు, 200 మంది ఐపీఎస్ (IPS)కు ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్-బి సర్వీసెస్ లో 113 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ సర్వీసెస్-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 అభ్యర్థులు ర్యాంకులు సాధించారు.