ప్రజలపై నగదు వర్షం

సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, భవేష్ భండారీ దంపతులు తమ సంపదను, నగదును, ఖరీదైన ఆభరణాలను, ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను ప్రజలకే ఇచ్చివేయాలనుకున్నారు. ఖరీదైన ఉపకరణాలను వాడకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో, ఆదివారం గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలో రథాన్ని తలపించేలా అలంకరించిన వాహనంలో నిల్చొని, కుటుంబ సభ్యులతో కలిసి భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భవేష్ భండారీ, ఆయన భార్య వాహనంపై నిల్చొని, భారీగా తరలివచ్చిన ప్రజలపైకి డబ్బులను, ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను విసిరివేశారు. ఆ ఊరేగింపుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ ఊరేగింపు వీడియోలో వ్యాపారవేత్త, ఆయన భార్య బట్టలు విసరడం, నగదు వర్షం కురిపించడం కనిపించింది. నోట్లు తీసుకునేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.