ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే….ఛత్తీస్ ఘడ్ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబం జీడిమెట్లలోని గాయత్రి నగరంలో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు(బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ) చేస్తారు. వీరి పిల్లలు వీధి బయట ఆడుకుంటుండగా… రెండు వీధి కుక్కలు దాడికి దిగాయి. పెద్ద పాప వాటి బారి నుంచి తప్పించుకోగా… చిన్నపాప అయిన దీపాలి(రెండున్నరేళ్లు) మాత్రం… కుక్కలకు చిక్కిపోయింది. దాడి చేసి చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి.చిన్నారిని దీపాలీని ఆసుపత్రికి తరలించగా.. శనివారం రాత్రి ప్రాణాలు(Streed dogs attack Child died ) విడిచింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.