సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించి విజయవాడ సీపీ కాంతి రాణా టాటా కీలక వివరాలు వెల్లడించారు. ఎయిర్ గన్, క్యాట్ బాల్ తో దాడి చేశారానే దానికి ఆధారాలు లేవన్నారు. కానీ విసిరిన రాయి చేతితో సరి పోయేంత ఉందన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ప్రాథమిక సమాచారం సేకరించామన్న సీపీ.. నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుందన్నారు. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు కాబట్టే ఇద్దరికీ గాయం అయ్యిందన్నారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టామని సీపీ పేర్కొన్నారు.