సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించి విజయవాడ సీపీ కాంతి రాణా టాటా కీలక వివరాలు వెల్లడించారు. ఎయిర్ గన్, క్యాట్ బాల్ తో దాడి చేశారానే దానికి ఆధారాలు లేవన్నారు. కానీ విసిరిన రాయి చేతితో సరి పోయేంత ఉందన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ప్రాథమిక సమాచారం సేకరించామన్న సీపీ.. నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుందన్నారు. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు కాబట్టే ఇద్దరికీ గాయం అయ్యిందన్నారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టామని సీపీ పేర్కొన్నారు.
Vijayawada CP On Stone Attack:విద్యుత్ నిలిపివేత సెక్యూరిటీ ప్రొటోకాల్లో భాగమే
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.