బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు(BRS MP K Keshava Rao)…. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ… కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు.