రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్

అన్సారీ మరణం (Mukhtar Ansari death) నేపథ్యంలో ఆయన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మౌ, ఘాజీపూర్, బందా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. వారణాసి, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా పోలీసు మోహరింపును పెంచామని, సున్నితమైన జిల్లాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించామని పేరు చెప్పడానికి ఇష్టపడని యూపీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని మరో అధికారి తెలిపారు.