ఈ ప్రాంతాల్లో తిరుగులేని నేత

ఘాజీపూర్, మౌ, ఆజంగఢ్, వారణాసి, మీర్జాపూర్, జౌన్పూర్ జిల్లాల్లో ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) కి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ముఖ్యంగా అక్కడి ముస్లిం సమాజం ఆయన గీసిన గీత దాటరని చెబుతుంటారు. ముఖ్తార్ అన్సారీ 1995లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఘోసి నుంచి బీఎస్పీ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కల్పనాథ్ రాయ్ పై పోటీ చేసి, ఓడిపోయారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల తరువాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మద్దతుతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా అన్సారీ డీజీపీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మిత్రపక్షం బీజేపీ ఒత్తిడితో బీఎస్పీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.