ఈ మెగా టోర్నీ ద్వారా అమెరికాలోనూ క్రికెట్ క్రేజ్ పెరగనుంది. బాస్కెట్ బాల్, అమెరికన్ ఫుట్‌బాల్, బేస్ బాల్, ఐస్ హాకీలాంటి గేమ్స్ అమెరికాలో ఎక్కువగా ఆడతారు. అలాంటి దేశంలో క్రికెట్ కు క్రేజ్ పెంచాలని ఐసీసీ చూస్తోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఆ దేశ జట్టు కూడా ఆడుతోంది. అందులోనూ భారత సంతతికి చెందిన ప్లేయర్సే ఎక్కువగా ఉండటం విశేషం.