ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని జ‌గ‌న్ చేపట్టారు. తాను వయసులో చిన్నోడిని అయినా.. తన కన్నా వయసులో పెద్ద వాళ్లు అయిన వారు చేసిన దానికన్నా ఎక్కువే చేశానని చెప్పారు. చంద్రబాబుని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని జగన్ కోరారు.