పోలీసుల విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యపై విచారణ జరిపేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్ మట్ట ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, ఆవేశాలకు లోను కావద్దని, శాంతియుతంగా ఉండాలని పోలీసులు సిక్కు సమాజానికి విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అవసరమైతే, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకుంటామన్నారు.