గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదని పెనమలూరు టీడీపీ నేత బోడే ప్రసాద్ చెప్పారు. వల్లభనేని వంశీతో ఒకటి రెండు సార్లు మాట్లాడటం నిజమేనని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఓ పని విషయంలో మట్లాడానని అన్నారు. కావాలనే తనపై బురద చల్లేందుకు అధిష్ఠానానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి తనకి టికెట్ రాకుండా చేస్తున్నారని బోడే ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే ప్రజల్లో తిరిగి కొట్లాడేందుకు రావాలని సవాల్ విసిరారు.