ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్​లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులకు.. విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ 1998లో తీర్పును వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 105(2), 194(2 ) పార్లమెంటరీ ప్రివిలేజ్​ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇస్తున్నట్టు నాటి ధర్మాసనం పేర్కొంది. అయితే.. ఆ తీర్పు అర్థం, లంచం తీసుకోవడం అనేది ఆర్టికల్​ 105, 194 లకు విరుద్ధంగా ఉన్నాయని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు.. నాటి తీర్పును కొట్టివేసింది.. సీజీఐ జస్టిస్​ చంద్రచూడ్​ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం.