నిర్మాత ధీరజ్ మొగిలినేని దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఆయనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మొదట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది.