మల్లు రవి రాజీనామా అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… నలుగురిని సలహాదారులుగా నియమించింది. ఇందులో మల్లు రవి ఒకరిగా ఉన్నారు. గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సోదరుడు అవుతారు.