నిందితుల నుంచి రూ. 8 లక్షలు విలువైన 21.7 గ్రాముల ఎండిఎంఏ, 874 గ్రాముల గంజాయి, ఒక కారు, రెండు సెల్ ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన పవన్,అరుణ్ కుమార్ సింగ్‌లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎండిఎంఏ డ్రగ్స్ ని బెంగళూరు నుంచి, గంజాయి ఒడిశా సరిహద్దు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక లాభాలకు విక్రయిస్తున్నారని డిసిపి వినీత్ వివరించారు.