PV Narasimha Rao Bharat Ratna : “మాజీ ప్రధాని శ్రీ నరసింహ రావు గారికి భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఓ గొప్ప రాజకీయవేత్త. అనేక మార్గాల్లో దేశానికి సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్​ సీఎంగాను ఆయన చాలా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి, ఎంపీ, శాసనసభల్లో ఎన్నో ఏళ్ల పాటు ఆయన చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరు. విజన్​ ఉన్న గొప్ప నాయకుడు నరసింహ రావు. దేశ ప్రగతికి, వృద్ధికి ఆయన పునాది వేశారు,” అని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.