ఏపీలోని అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసునే ఢీకొట్టి వెళ్లారు. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడున్నాయి. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని లోకేశ్ విమర్శించారు. పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైసీపీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తిందని ఆరోపించారు.