ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై చర్చిస్తున్నప్పుడు ఎందుకు టీడీపీ ఆందోళన చేస్తోందని ప్రశ్నించారు. 2024 శాసనసభ ఎన్నికల్లో బాలకృష్ణ సహా ఎవరూ గెలవరని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసుదరన్ రెడ్డి అన్నారు. దెందలూరులో సిద్ధం సభ పెడితే 5 లక్షల మంది వచ్చారన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చంద్రబాబు సభకు నాలుగు వేల మంది కూడా రావటం లేదని ఎద్దేవా చేశారు.