ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాడులు పెరిగాయి. తాజాగా పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను వచ్చారు. కార్యక్రమానికి అంతా సిద్దమై మరి కొద్దిసేపట్లో కన్నా హాజరవుతారనగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభాస్థలిలో లైట్లను ఆర్పేసిన గుర్తు తెలియని దుండగులు సమీప భవనాల నుండి రాళ్ల దాడికి చేశారు. ఈ దాడిలో కన్నా PA స్వామి తలకి తీవ్ర గాయమైంది.ఈయనతోపాటు మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.