Home News “జనం కోరుకుంటోంది ఇదే”-చంద్రబాబుకు తేల్చేసిన సాయిరెడ్డి ..!

“జనం కోరుకుంటోంది ఇదే”-చంద్రబాబుకు తేల్చేసిన సాయిరెడ్డి ..!

6
0

“జనం కోరుకుంటోంది ఇదే”-చంద్రబాబుకు తేల్చేసిన సాయిరెడ్డి ..!

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈ మధ్యే సంబరాలు జరుపుకుంది. అయితే రాష్ట్రంలో ప్రజలు అదే రెండేళ్ల క్రితం ఏం కోరుకుని ప్రభుత్వానికి ఓటేశారో ఆ ప్రయోజనం కచ్చితంగా నెరవేరిందా అంటే ఎవరి వద్దా సమాధానం లేదు. దీని వెనుక ఉన్న ఓ కీలక కారణాన్ని వైసీపీ మాజీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) బయటపెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం పెట్టుబడుల ప్రకటనలకు పరిమితం అవుతూ ప్రజలకు కావాల్సిన అసలు ప్రయోజనాల్ని పట్టించుకోవడం లేదని సాయిరెడ్డి వెల్లడించారు.

మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేవలం పెట్టుబడుల ప్రకటనలపై ఆసక్తి లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. అవి వాస్తవంగా కార్యరూపం దాల్చుతాయా లేదా అనేదే వారికి ముఖ్యమన్నారు. అది జిందాల్ స్టీల్ ప్లాంట్ అయినా, గూగుల్ ఏఐ డేటా సెంటర్ అయినా, ఈ ప్రాజెక్టులు సకాలంలో ప్రారంభమై, ఉద్యోగాలు, అభివృద్ధి, వాగ్దానం చేసిన ప్రయోజనాలను అందించడమే ముఖ్యమని సాయిరెడ్డి తెలిపారు.

Where is Public Benefits VijayaSai Reddy Reminds Chandrababu of People s Expectations from the Government

మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!
మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!

సంతకం చేసిన ప్రతి అవగాహన ఒప్పందం (MoU), దాని ప్రారంభ స్థితి, ప్రాజెక్ట్ పూర్తి కాలపరిమితి, సృష్టించబడిన ఉద్యోగాలు, విస్తరణ ప్రణాళికలను నమోదు చేసే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి కోరారు. పారదర్శకత మాత్రమే జవాబుదారీతనాన్ని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చంద్రబాబుకు ఆయన సూచించారు. మరి సాయిరెడ్డి సూచనను చంద్రబాబు పాటిస్తారా లేదా అన్నది చూ

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here