పటాన్చెరు జానవాహిణి ప్రతినిధి జూన్ 17 :- వేసవి సెలవుల అనంతరం కాగ్నిబాట్ స్కూల్ నేడు తిరిగి సందడి వాతావరణంలో పునఃప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పాఠశాల ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో కళకళలాడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు గారు తమ బృందంతో కలిసి పాఠశాల ప్రధాన ద్వారం వద్ద నిలబడి ప్రతి విద్యార్థిని ఆప్యాయంగా స్వాగతించారు. చిరునవ్వులతో, ప్రేమాభిమానాలతో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి మధురమైన ఆతిథ్యాన్ని అందించారు. సెలవుల అనంతరం మళ్లీ తమ స్నేహితులు, ఉపాధ్యాయులను కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాఠశాల ప్రాంగణాన్ని నింపారు. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. “ప్రతి విద్యార్థి విజయం మా లక్ష్యం” అనే భావనతో కాగ్నిబాట్ స్కూల్ యాజమాన్యం ప్రేమ, శ్రద్ధ, నిబద్ధతతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఆత్మీయ స్వాగత కార్యక్రమాన్ని అభినందించారు.





