HomeTelanaganahyderabadదేశభక్తి చాటిన తాండూరు యువత...!

దేశభక్తి చాటిన తాండూరు యువత…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • నేతాజీ విగ్రహం వద్ద ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
  • హిందూ వాహిని ,తాండూర్ యువకుల ఆధ్వర్యంలో వేడుకలు 
  • అల్పాహారం వితరణ 

జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రాంతం గురువారం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. హిందూ వాహిని మరియు యువకుల సంయుక్త ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా నేతాజీ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి పూలమాలలు వేశారు. ఆ తర్వాత ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు.
ఈ వేడుకల సందర్భంగా కార్మికులను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి అల్పాహారం పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్మికుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్, రజినీకాంత్, కటకం హరీష్, గుబ్బ నరేష్, రాఘవేందర్, జోషి వికాస్, అనిల్, శివకుమార్, సాయి, నవీన్, కేశవులు, హిందూవాహిని గణేష్, మధు, బన్నీ, అభిషేక్ తదితర యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments