- శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయం
- ప్రజలకు చేరువగా పోలీస్ యంత్రాంగం
- ఎస్పీ స్నేహా మిశ్రా నాయకత్వాన్ని అభినందించిన
జనవాహిని ప్రతినిధి తాండూరు : జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర ను శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ చేస్తున్న కృషిని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, నేర నియంత్రణలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్న ఎస్పీ స్నేహా మెహ్ర నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా బాధ్యతాయుతమైన సేవలందించాలని ఆకాంక్షించారు.




