IRCTC Hyderabad Srisailam Tour Package 2024 : మరోవైపు బడ్జెట్ ధరలోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఒకే ప్యాకేజీలు పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేలా ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ”SPIRITUAL TELANGANA WITH SRISAILAM’ పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని (IRCTC Srisailam Tour)తీసుకొచ్చింది. రోడ్డు మార్గానే జర్నీ ఉంటుంది.ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా…మీరు’ శ్రీశైలాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా…. హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ ను సందర్శించారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది. మొత్తం 4 రోజుల ప్యాకేజీ ఇది.