15 కోట్ల విలాసవంతమైన ఇల్లు

నీతూ కపూర్ భర్త, దివంగత నటుడు రిషి కపూర్ ఆమెను తన ఆస్తులన్నింటికీ సగం యజమానిగా చేశారని బాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నీతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే, బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా కపూర్ ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు ప్రాంతంలో ఉంటున్నారు.