ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉంటే మనసు కష్టంగా ఉంటుందని ఆదర్శ్ చెప్తాడు. మురారి, కృష్ణ ఉండటం ఇష్టం లేదని అంటున్నాడు నన్ను కూడా ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడని నందిని తల్లికి చెప్తుంది. అంత కష్టంగా ఉంటే వెళ్లిపోతామని కృష్ణ, మురారి తినకుండా లేస్తారు. భవానీ సీరియస్ గా కూర్చోమని చెప్తుంది. కొన్ని బంధాలు నిలబడాలంటే కొన్నింటిని లెక్కలోకి తీసుకోవాలి, కొన్నింటిని లెక్క తీసుకోకూడదు. కొన్నాళ్ళు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళని దూరంగా పొమ్మంటున్నావా అని భవానీ అడుగుతుంది.