తండ్రికి సాయంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక దీపను తన కొడుకు నరసింహానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనసూయ ఫిక్స్ అవుతుంది. ఒకరోజు సుమిత్ర తన మేనల్లుడు కార్తీక్, కూతురు జ్యోత్స్నని తీసుకుని గుడికి వెళ్తుంది. గుడి దగ్గర ఉన్న కొలనులో కలువ పువ్వులు తీసుకురమ్మని జ్యోత్స్న కార్తీక్ ని బలవంత పెడుతుంది. తనకి నీళ్లంటే భయమని చెప్పినా కూడా వినిపించుకోదు. దీంతో కార్తీక్ వాటి కోసం కొలనులోకి దిగుతాడు. నీళ్ళలో మునిగిపోతుంటే అటుగా వెళ్తున్న దీప చూసి కాపాడుతుంది. అప్పుడే తొలిసారిగా దీప తన తల్లి సుమిత్రని అనుకోకుండా కలుస్తుంది.