తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా అప్లికేషన్లు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు రోజులు గడువు పెంచటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ల సంఖ్యపై మరింత స్పష్టత రానుంది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.