Satwik – Chirag Asian Games: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి చరిత్ర సృష్టించారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకంతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో చిరాగ్ – సాయిరాజ్ ద్వయం స్వర్ణ పతకంతో సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 7) జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో చిరాగ్ శెట్టి – సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-18, 21-16 తేడాతో వరుస గేమ్ల్లో కొరియా ద్వయం చోయి సోల్ గ్యు, కిమ్ వోన్ హొను చిత్తు చేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్లో భారత్ స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు చిరాగ్ శెట్టి – సాత్విక్ సాయిరాజ్.
చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్.. స్వర్ణం కైవసం-chirag shetty satwiksairaj rankireddy creates history with gold in asian games ,స్పోర్ట్స్ న్యూస్
Related Posts
Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..
అప్పటికే టాప్ లో ఉన్న గుకేశ్.. కేవలం డ్రా చేసుకున్నా సరిపోతుందనే పరిస్థితుల్లో అతడు అదే చేశాడు. మరోవైపు నకమురాతోపాటు ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చిలాంటి ప్లేయర్స్ చివరి రౌండ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగారు. అయితే చివరి రెండ్లో…
WrestleMania XL: రోమన్ రీన్స్ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్మేనియా ఎక్స్ఎల్ నైట్లో సంచలనం
WrestleMania XL: రెజిల్మేనియా ఎక్స్ఎల్ నైట్ లో చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ కొత్త ఛాంపియన్ గా నిలిచాడు కోడీ రోడ్స్. అతడు రోమన్ రీన్స్ ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.