Satwik – Chirag Asian Games: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి చరిత్ర సృష్టించారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో చిరాగ్ – సాయిరాజ్ ద్వయం స్వర్ణ పతకంతో సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 7) జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‍లో చిరాగ్ శెట్టి – సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‍ల్లో కొరియా ద్వయం చోయి సోల్ గ్యు, కిమ్ వోన్ హొను చిత్తు చేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‍లో భారత్ స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు చిరాగ్ శెట్టి – సాత్విక్ సాయిరాజ్.