సంగమణిని హత్య చేయడానికి రూ.20 వేలకు ఒప్పందం

ఆ పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన మహేష్ తో సంగమణిని హత్య చేయడానికి రూ. 20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ లో భాగంగా ఈ నెల 11న ఆశయ్య రెండో భార్య మంజులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11:00 గంటల సమయంలో మహేష్, అతని స్నేహితుడు శివకుమార్ తో కలిసి ఆశయ్య చెప్పినట్లుగా వంట గదిలో పొగ బయటకు వెళ్లే గొట్టం ద్వారా ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగమణి వద్దకు వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న సంగమణిని ఇంట్లో ఉన్న ఈలపీటతో గొంతు, ముఖంపై కోసి చంపారు(Supari Murder). అనంతరం మహేష్, శివ కుమార్ లు కలిసి బెడ్ రూమ్ బీరువాలో ఉన్న రూ. 20 వేల నగదు, సంగమణి మెడలో ఉన్న నల్లపూసల గొలుసు, పుస్తె, ఆమె కుడి చెవి కమ్మను తీసుకొని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహేష్, శివ కుమార్ లను అనుమానితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వీరి ఇద్దరితో పాటు ఆశయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. హత్య మిస్టరీని ఛేదించడంతో హవెళి ఘనపూర్ ఎస్సై ఆనంద్ గౌడ్, సిబ్బందిని అభినందించారు.