యువ నాయకత్వానికి పట్టం కట్టండి..! 

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • నాతో పాటు నడవండి" ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి లక్ష్యం
  • ఆదర్శ తండా నిర్మాణానికి  ప్రణాళికలు
  • తొలిసారి బరిలో నిలిచిన యువకుడికి పెరుగుతున్న మద్దతు
  • ఉంగరం' గుర్తుకే మీ తొలి ఓటు వెయ్యండి కొత్త పాలనకు దారి తీయండి
  • యువనాయకుడు దేవా...

జనవాహిని ప్రతినిధి తాండూరు :అంతరం వాసు నాయక్ తండా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈసారి సరికొత్త ఉత్సాహాన్ని, ఆశను నింపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా, తొలిసారిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఉత్సాహవంతమైన యువకుడు, 'దేవా' ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తండా ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించాలనే ఏకైక లక్ష్యంతో దేవా ఎన్నికల బరిలోకి దిగారు.యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, గ్రామాభివృద్ధికి ఆయన చేస్తున్న పిలుపు తండాలో చర్చనీయాంశమైంది.దేవా తన ఎన్నికల ప్రచారంలో "నాతో పాటు నడవండి, తండాను అభివృద్ధి చేద్దాం" అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు యువతలోని శక్తిని, ఆలోచనలను, నూతన సాంకేతికతను జోడించాలని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.

అంతరం వాసు నాయక్ తండాలో పారదర్శకమైన పాలన, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నా ప్రధాన లక్ష్యం. మార్పు కోరుకునే ప్రతీ ఒక్కరూ నా వెంట నడవాలి," అని దేవా ప్రజలను కోరారు.ఈ ఎన్నికల్లో దేవాకు 'ఉంగరం' గుర్తు కేటాయించబడింది.మొట్టమొదటిసారిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఈ యువ నాయకుడిని ఆశీర్వదించాలని, యువతకు, నూతన మార్పుకు మద్దతు తెలపాలని ఆయన తండా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి, దేవాను గెలిపించడం ద్వారా తండా అభివృద్ధికి నూతన అధ్యాయం లిఖించాలని ఆయన కోరారు.తండాలో దేవాకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే, ఈసారి ఎన్నికల ఫలితాలు యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *