ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వైద్యం చేసే నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మత్తులోకి జారుకున్నాక, వారి వద్దనున్న డబ్బు దోచుకున్నాడనే ఆరోపణలు వైద్యుడిపై ఉన్నాయి. మత్తు ఇంజెక్షన్ల ప్రభావానికి బాధితులు అస్వస్థతకు గురై కోలుకునే వారు. ఈ తరహా ఘటనలపై ఏలూరు త్రీటౌన్‌, వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి.