Saturday, May 9, 2026

― Advertisement ―

ఎమ్మెల్యేపై కేసు..? అంతా బీఆర్ఎస్ డ్రామా!

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కుట్రపూరితంగానే ప్రైవేట్ కేసులు  బీఆర్ఎస్ ‘కౌంటర్ బ్లాస్ట్’ వ్యూహం బయటపడింది  పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికే తప్పుడు ఫిర్యాదుల  అభివృద్ధిని చూసి ఓర్వలేకే అబద్ధపు ప్రచారం  జిల్లా...
HomeNEWSఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కేసు నమోదు..! 

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కేసు నమోదు..! 

spot_img
  • కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకున్న తాండూరు పోలీసులు
  • జాబితాలో ధారాసింగ్,  కరణం పురుషోత్తం రావు,  రవి గౌడ్, హబీబ్ లాలా
  •  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారనే ఆరోపణలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, కారణం పురుషోత్తం రావు,   రవి గౌడ్, హబీబ్ లాలా మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ ని విచారించిన కోర్టు, ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.ఈ ఘటనపై బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే కుట్రతోనే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారని విమర్శించారు. కౌంటింగ్ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించి చొరబడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నమోదుతోనైనా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మరి తాండూరు పోలీసులు ఈ కేసు ను ఈ విధంగా విచారణ చెప్పడతారో చూడాలన్నారు