- పంతం కోసం పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంద
- ఆ వార్డ్ లో అధికార పార్టీ పెత్తనం కొనసాగాలని చూస్తున్నారా
- ప్రతిపక్ష నాయకుడిపై అధికార పార్టీ మంతానలు తిప్పి కొడుతున్నాయా
- ఆ వార్డ్ లో అసలు ఎం జరుగుతుంది
- పెత్తనానికి పోయి తమ పార్టీ ప్రతిష్టను వారే తీసుకుంటున్నారా
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు లో రాజకీయం అంటేనే తరస్థాయిలో ఉంటుంది. పచ్చి గడ్డి కి నిప్పు అంటుకునేలా ఉంటుంది తాండూరు రాజకీయం. అలాంటి పరిస్థితితే ఓ వార్డ్ లో ఎర్పడింది. అసలు ఎన్ని రోజులు ఆ వార్డ్ ను పట్టించుకునే నాథుడే లేకుండే, అలాంటి వార్డ్ ప్రస్తుతం పట్టణం అంతా హాట్ టాపిక్ గా మారింది.అసలు ఆ వార్డ్ కతేంటి. అక్కడ ఉన్న నాయకులు ఎవరు ఎందుకు ఇంత వేడిపై ఉంటుంది ఆ వార్డ్ అనేది తెలుసుకుందాం. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ రాజీవ్, ఇందిరమ్మ కాలనీ లో రోజు రోజుకు రాజకీయ వేడి పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయినా మరుసటి రోజు నుండే ఆ వార్డ్ లో రాజకీయం తరస్థాయిలోకి చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జావీద్ 800 పై చిలుకు ఓట్లతో గెలిచినా విషయం తెలిసిందే. అయితే గతంలో 8 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గా ఉన్నారు. రాజీవ్, ఇందిరమ్మ కాలనీలు ఏర్పాడినప్పటి నుండి అసలు ఆ వార్డ్ ను పట్టించుకునే నాథుడే లేకుండే. అలాంటి వార్డ్ ప్రస్తుతం ఎక్కడ చూసి ఆ వార్డ్ గురించే మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. అది కాస్త బిఆర్ఎస్, కాంగ్రెస్ అనే కోణం లో కొనసాగుతుంది. 8వ వార్డ్ లో ప్రస్తుతం బిఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న కాంగ్రెస్ నాయకుల హావ కొనసాగాలని స్థానిక నాయకులు, ఇతర పెద్ద నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తమ పెత్తనం ఆ వార్డ్ లో కొనసాగితే, ప్రతిపక్ష నాయకుడిని అదుపులో పెట్టుకోవచ్చు అన్నట్టుగానే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్నారు అధికార పార్టీ కి చెందిన నాయకులు. అయినా ఏ మాత్రం వెనకాకడుగు వెయ్యకుండా స్థానిక వార్డ్ కౌన్సిలర్ మాత్రం తన అధికారమే ఇక్కడ ఫైనల్ అన్నట్టుగా ఉన్నారు. వార్డ్ కౌన్సిలర్ ఆ స్థానిక పాలకూడని పడే పడే తేల్చి చెప్పేస్తున్నాడు. దింతో అది కాస్త అధికార పార్టీ కి నచ్చడం లేదనే పుకార్లు ఉన్నాయ్. వాళ్ళ పెత్తనం చాలయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న, అవి కాస్త తిప్పి కొడుతున్నాయి అని తెలుస్తుంది. తాజాగా స్వతంత్ర దినోత్సవం సందర్బంగా 8వ వార్డ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటులో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగువివాదం నెలకొంది. మేమే ఇక్కడ జెండా ఎగరేస్తాం అంటే లేదు లేదు నేనే ఇక్కడ కౌన్సిలర్ నేనే కార్యక్రమం ఏర్పాటు చేస్తానంటూ కాస్త వివాదం ఎర్పడింది. ఈ వ్యవహారం కాస్త పోలీసులు జోక్యం చేసుకునే దాక వెళ్లిందని సమాచారం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రతి జెండా పండగకి తాండూరు ఎమ్మెల్యే ప్రోటోకాల్ పరంగా క్యాంపు కార్యాలయం లో జెండా ఆవిష్కరించాలి కానీ, స్వతంత్ర దినోత్సవం నాడు మొదట 8వ వార్డ్ లో ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించడం ఇదే మొదటి సారి. అనుకున్న టైం లోనే స్థానిక కౌన్సిలర్ ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సమయానికే ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది. అయితే ఎమ్మెల్యే కు స్థానిక కౌన్సిలర్ ఇన్విటేషన్ ఇవ్వలేదని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ను ప్రోటోకాల్ తప్పించే పనులు చేసారని స్థానికంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పనులు వారికీ తిప్పి కొడుతున్నాయాని చెప్పవచ్చు. ఇదే మాదిరిగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాస్త వివాదానికి దారి తీసింది. 8వ వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ పని తనం చూపించాలనుకునే క్రమంలో ఎదురుదెబ్బ తగలడం కామన్ గా మారింది. ఒకే పార్టీ నాయకుల మధ్య జరిగిన వాగ్వివదం కాస్త వారి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా మారింది. అసలు రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు. ఆ వార్డ్ పైనే ఎందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా బిఆర్ఎస్ కౌన్సిలర్ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా …ఆయనను ఎన్నుకున్న ప్రజల్లో మాత్రం మంచి పట్టును సాధిస్తున్నారు. ముందు రోజుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పోరు ఆ వార్డ్ లో ఏ స్థాయికి చేరుతుందో అనే ఆసక్తి నెలకొంది.