ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత..

కొత్త శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని ఈ మార్చి నెలాఖరులోగా అమలు చేస్తామని గడ్కరీ గత ఏడాది డిసెంబర్ లో ప్రకటించారు. అయితే లోక్ సభ ఎన్నికల (Lok sabha elections) ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటం వల్ల ఈ విధానాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదని గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ ట్యాక్స్ విధానం సమయం, ఇంధనాన్ని ఆదా చేయడానికి ఎలా సహాయపడుతుందో గడ్కరీ వివరించారు. ‘‘గతంలో ముంబై నుంచి పుణెకు వెళ్లాలంటే 9 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 2 గంటల ప్రయాణం. అంటే, ఏడు గంటల ప్రయాణానికి అవసరమయ్యే ఇంధనం ఆదా అవుతుంది. అందుకు ప్రతిఫలంగా సహజంగానే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ- ప్రైవేటు పెట్టుబడుల రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఆ డబ్బును కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే రెండు చోట్ల టెస్ట్ రన్ నిర్వహించాం’’ అని గడ్కరీ తెలిపారు.