- స్నేహితుల దినోత్సవం నాడు ఉదారత చాటుకున్న ‘యువజాగృతి’
- రోడ్డు ప్రమాద బాధితుడికి ₹3,000 ఆర్థిక సాయం
- ఆపదలో ఆదుకోవడమే నిజమైన మైత్రి, యువజాగృతి సభ్యులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులోని ‘యువజాగృతి’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక యువకునికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్కు చెందిన తరుణ్ చారి గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, బాధితుడి కుటుంబ పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అవసరమని 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్ ద్వారా తెలుసుకున్న యువజాగృతి సభ్యులు తక్షణమే స్పందించారు.సహాయంలో భాగంగా ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా బాధితుని కుటుంబానికి ₹3,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న తోటి మిత్రుడిని ఆదుకోవడమే నిజమైన మైత్రికి అర్థమని పేర్కొన్నారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్, సభ్యులు పట్లోళ్ల ప్రశాంత్, గుబ్బ నరేష్, టిప్పు సుల్తాన్, కటకం హరీష్, కనకం శ్రావణ్, ఆస్తికర్ ఆశిష్, శివ కుమార్, మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

