- పట్నం కుటుంబానికి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ
- దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన ఆర్బిఓఎల్ సీఈఓ
- పాల్గొన్న నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: మాతృవియోగానికి గురైన పట్నం కుటుంబాన్ని ఆర్ బి ఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. మొయినాబాద్లోని జీపీఎల్ కన్వెన్షన్లో ఆదివారం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా దివంగత మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న పట్నం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు రావుఫ్, కౌన్సిలర్ లు బంటు వేణు, శ్రీకాంత్, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

