- రూ. 290 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాప
- ఈ నెల 16న తాండూరుకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు
- 36 వార్డుల ప్రజలు, నాయకులు తరలిరావాలి
- పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ఈ నెల 16న పట్టణంలో భారీ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ. 290 కోట్ల భారీ వ్యయంతో తాండూరు లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.ఈ పర్యటనను పురస్కరించుకుని తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు మహిళలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని జి.పి.ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రతీ ఒక్కరూ విచ్చేసి, మంత్రుల పర్యటనను మరియు సభను విజయవంతం చేయాలని బాతుల నాగు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఈ సువర్ణావకాశాన్ని ప్రజలంతా హర్షించాలని ఆయన పేర్కొన్నారు.