HomeNewsఓటర్లారా.. నిర్లక్ష్యం వద్దు..!

ఓటర్లారా.. నిర్లక్ష్యం వద్దు..!

  • ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం
  •  ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్వోలు.. ‘గణన పత్రాలు’ తప్పనిసరి
  •  2002 ఓటర్ల డేటాతో మ్యాపింగ్.. నకిలీ ఓట్లకు ఇక బ్రేక్!

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్, డబుల్ ఓట్లను పూర్తిగా ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇంతటి భారీ సవరణ ప్రక్రియ జరుగుతుండటంతో యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. బూత్ లెవెల్ అధికారులు (BLO) గ్రామగ్రామాన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.

2002 డేటాతో అనుసంధానం..

ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను గత 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ (అనుసంధానం) చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నా, చనిపోయిన వారి పేర్లు అలాగే కొనసాగుతున్నా వాటిని తొలగించి, క్లియర్ మరియు పారదర్శకమైన ఓటర్ లిస్ట్‌ను తయారు చేయడానికి ఈ డేటా మ్యాపింగ్ దోహదపడుతుంది.

ఓటర్లు చేయాల్సిన ముఖ్యమైన పనులు:

గణన పత్రం (Enumeration Form) పూర్తి చేయాలి:** ప్రతి ఇంటికి వచ్చే బీఎల్వోలు ఇచ్చే ప్రింటెడ్ గణన పత్రాన్ని (ఎన్యూమరేషన్ ఫారం) ఓటర్లు పూర్తిగా నింపాల్సి ఉంటుంది. మీ తాజా ఫొటోను దానికి జతచేసి, సంతకం చేయాలి.

బీఎల్వోలకు అందజేయడం:

పూర్తి చేసిన ఫారాలను నిర్దేశిత గడువులోగా స్థానిక బీఎల్వోలకు తిరిగి సమర్పించాలి. ఈ ఫారాలు అందిన వారి పేర్లు మాత్రమే రాబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలోకి ఎక్కుతాయి.

ఆన్‌లైన్ ద్వారా కూడా సదుపాయం:

బీఎల్వోలకు అందుబాటులో లేని వారు నేరుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ **https://voters.eci.gov.in** లోకి వెళ్లి కూడా ఆన్‌లైన్ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే ఓటర్ కార్డు, ఆధార్ కార్డులోని పేర్లు ఒకేలా ఉండటం అవసరం.

నోటీసులు వస్తే తస్మాత్ జాగ్రత్త!

2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న ఓటరు వివరాలు మ్యాపింగ్ కాకపోతే, అధికారులు సదరు ఓటరుకు నోటీసులు జారీ చేస్తున్నారు. అలా నోటీసు వచ్చిన వారు నిర్లక్ష్యం చేయకుండా ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించి మీ ఓటును భద్రపరుచుకోవాలి. మీ వివరాలు 2002 జాబితాతో మ్యాచ్ కాకపోతే అవి “నో మ్యాపింగ్” (Un-mapped) కేటగిరీ కిందకు వెళ్తాయి. సరైన ఆధారాలు చూపించని పక్షంలో ముసాయిదా జాబితా నుండి ఓటు తొలగించబడే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోండిలా..మీరు ఇచ్చిన ఫారం ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి voters.eci.gov.ఇం లో మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ Your form has already been సుబ్మిత్తెద్ అని వస్తే మీ ఓటు సురక్షితంగా ఉన్నట్లే. లేని పక్షంలో అక్కడే ఉన్న మీ బీఎల్వో నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు సరిచేసుకోవచ్చు. రాబోయే ముసాయిదా జాబితా ప్రకటన కంటే ముందే ప్రతి ఒక్కరూ తమ ఓటును తనిఖీ చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments