పట్టణ ఆకర్షణగా ఇందిరా చౌరస్తా....!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • తాండూరు నడిబొడ్డున ‘మున్సిపల్’ వెలుగులు 
  • టౌన్ ఆఫ్ అట్రాక్షన్’గా ఇందిరా చౌరస్తా!
  •  చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ప్రత్యేక చొరవ
  •   అందంగా ముస్తాబు కానున్న ఫౌంటెన్..
  •  పట్టణ సుందరీకరణపై ఛైర్పర్సన్ ప్రత్యేక దృష్టి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ ముఖచిత్రం త్వరలో సరికొత్త హంగులతో మెరిసిపోనుంది. పట్టణ కేంద్రంలోని అత్యంత ప్రధానమైన ఇందిరా చౌరస్తాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. చౌరస్తా నడిబొడ్డున ఉన్న ఫౌంటెన్‌ను ఒక అద్భుతమైన ఆకర్షణగా మార్చే దిశగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.దశాబ్దాలుగా సాధారణంగా ఉన్న ఈ ఫౌంటెన్‌ను ఆధునిక సాంకేతికతతో, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా పునరుద్ధరించనున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, ఆకర్షణీయమైన నీటి చిమ్మే యంత్రాలు మరియు చుట్టూ పచ్చదనంతో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం ట్రాఫిక్ కూడలిగానే కాకుండా, పట్టణానికి వచ్చే వారికి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా ఈ ఫౌంటెన్ రూపురేఖలు మారనున్నాయి.పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్ల అభివృద్ధిపై చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందిరా చౌరస్తా పట్టణానికి హృదయకాయం వంటిదని, దానిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా తాండూరు వైభవం మరింత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. చైర్ పర్సన్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై పట్టణ ప్రజలు మరియు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *