HomeNewsIND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్ అదరగొట్టింది. హాకీ ప్రపంచ కప్ 2026లో జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5-3 గోల్స్ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దీంతో హాకీ వరలో రెండో రౌండ్‌కు క్వాలిఫై అయింది.

టెస్టుల్లో టీ20 ఫార్మట్ సిక్సర్లు- టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన రికార్డ్
టెస్టుల్లో టీ20 ఫార్మట్ సిక్సర్లు- టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అరుదైన రికార్డ్

భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఈ గ్రూప్ డి మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆరంభించింది. మొదటి క్వార్టర్‌లోనే 2 గోల్స్ చేసి భారత్ ప్రత్యర్థి జట్టును వెనక్కి నెట్టింది. రెండో క్వార్టర్‌లో పాకిస్థాన్ బాగా ఆడినప్పటికీ, మూడో, నాలుగో క్వార్టర్లలో అద్భుతమైన ఆటతీరుతో భారత్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ అద్భుతంగా పుంజుకుని గ్రూప్ డీ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో భారత్ 2026 హాకీ ప్రపంచ కప్ రెండో దశకు కూడా అర్హత సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేయగా, హార్దిక్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఈ ఓటమితో పాకిస్థాన్ 2026 హాకీ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.

IND vs PAK Hockey World Cup 2026 India Beats Pakistan 5-3 to Reach Second Round Full Details Here

భారత్ పూర్తి ఆధిపత్యం
తొలి క్వార్టర్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. ఐదో నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 11వ నిమిషంలో అభిషేక్ రెండో గోల్ చేసి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ పాకిస్థాన్‌పై 2-0 ఆధిక్యం సాధించింది.రెండో క్వార్టర్‌లో కూడా భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగింది. 20వ నిమిషంలో వారికి నాలుగో పెనాల్టీ కార్నర్ లభించింది. ఆ పెనాల్టీని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయినప్పటికీ.. కొద్దిసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఫీల్డ్ గోల్ రూపంలో భారత్‌కు మూడో గోల్ సాధించి 3-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది రెండో గోల్. ఆ తర్వాత పాకిస్థాన్ దాడికి దిగగా.. షాహిద్ హన్నన్ జట్టుకు తొలి గోల్ అందించాడు.

భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్లలో నష్టం..
భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్లలో నష్టం..

పాకిస్థాన్ తొలి గోల్ తర్వాత భారత్ దాడికి దిగగా, 24వ నిమిషంలో అభిషేక్ ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 4-1 ఆధిక్యాన్ని అందించాడు. పాకిస్థాన్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. 25వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ గోల్ చేసి స్కోరును 2-4కు సమం చేశాడు. రెండవ క్వార్టర్ అంటే మొదటి అర్ధభాగం ముగిసేసరికి భారత్ పాకిస్థాన్‌పై 4-2 ఆధిక్యాన్ని కొనసాగించింది.

మూడో క్వార్టర్లో ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్
రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి, కానీ మూడో క్వార్టర్‌లో భారత్‌కు పెనాల్టీ లభించింది. ఆ తర్వాత 34వ నిమిషంలో హార్దిక్ సింగ్ సులభంగా గోల్ చేసి భారత్‌కు 5-2 ఆధిక్యాన్ని అందించాడు. 37వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా.. గోల్ చేయడంలో విఫలమైంది. ఇది భారత్‌కు లభించిన ఐదో పెనాల్టీ కార్నర్. పాకిస్థాన్ పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మూడో క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా చేయడంలో విఫలమవడంతో భారత్ తమ 5-2 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.

పాకిస్థాన్ ను ఓడించిన భారత్
నాలుగో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే, 46వ నిమిషంలో పాకిస్థాన్ తరఫున షాహిద్ హన్నన్ గోల్ చేయడంతో స్కోరు 3-5కు చేరింది. ఆ తర్వాత భారత్ అద్భుతమైన రక్షణను పాటిస్తూ.. గోల్స్ చేస్తూ జాగ్రత్తగా ఆడటం ప్రారంభించింది. నాలుగో క్వార్టర్‌లో పాకిస్థాన్ అనేకసార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా.. భారత జట్టు చివరి నిమిషం వరకు ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా వారి ప్రయత్నాలను తిప్పికొట్టి, 5-3 తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments