16.3 C
New York
Tuesday, May 21, 2024

Buy now

అయ్యప్ప భక్తుడ్ని కారుతో ఢీకొట్టిన ఘటన, బైరి నరేశ్ పై కేసు నమోదు!-mulugu news in telugu police case filed on bairi naresh ayyappa devotee injured in car accident ,తెలంగాణ న్యూస్

Bairi Naresh : నాస్తికుడు బైరి నరేశ్… అప్పయ్య భక్తులను కారుతో ఢీ కొట్టి పరారయ్యారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బైరి నరేశ్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఎవరిపైనా దాడి చేయలేదని తెలిపారు. తాను అయ్యప్ప భక్తులపై దాడి చేశానన్న వార్తలో నిజం లేదన్నారు. అయితే అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీకొట్టిన ఘటనలో బైరి నరేశ్ పై ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాద కింద అయ్యప్ప స్వామి పుట్టుకపై నాస్తికుడు బైరి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. దాదాపు 45 రోజుల పాటు బైరి నరేశ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. పలుమార్లు హిందూ దేవుళ్లపై బైరి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో బైరి నరేశ్ ఎక్కడ కనిపించినా అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles